Wednesday, 29 April 2026

స్వాగతం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం వ్రాసిన మహర్షి .. 

శ్రీమాన్‌ ప్రతివాది భయంకరం అణ్ణన్‌ స్వామి.

ఆ స్వామి సేవించుకున్న ద్వాదశ సాలగ్రామాలు - భూ నీళా సమేత లక్ష్మీనారాయణ అర్చామూర్తులు వారి వంశస్థుల సేవలో అలరారుతూ .. గత ఆరున్నొక్క వందల ఏళ్ల నుంచి పలువురను తరింపజేశాయి. అణ్ణన్‌ స్వామి సేవించుకున్న సాలగ్రామాలు - అర్చామూర్తులు కొలువుదీరిన క్షేత్రమే “దివ్య సాలగ్రామ క్షేత్రం”.

మనిషిని ఋషిని చేయగల విశేషత, విశిష్టత ఉన్న సాలగ్రామాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ సమర్ధత మేరకు ప్రత్యక్ష పరోక్ష స్థితుల్లో ఆరాధించుకోవడానికి, సేవించుకోవడానికి, తద్వారా జీవితమంతా ఆనందమయం చేసుకోవడానికి పరిపూర్ణమైన అవకాశాన్ని అందించేదే ‘‘దివ్య సాలగ్రామ క్షేత్రం’’.

 నిత్యం ఋషి ప్రోక్తమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవత్ప్రేరితమైన యజ్ఞయాగాలతో పాటు వ్యక్తి, కుటుంబం, సమాజం శ్రేయస్సుకు ఉపయుక్తమైన క్రతువుల నిర్వహణకు ఆలయంగా భాసిల్లుతున్న ప్రాంగణం ఈ ‘‘దివ్య సాలగ్రామ క్షేత్రం’’

శ్రీకృష్ణార్పణమస్తు !!!

No comments:

Post a Comment